మన ఊరి ముచ్చట పత్రిక నసుర్లాబాద్ ఏప్రిల్ 11 :
పోచారం స్వగృహంలో స్మార్ట్ స్మార్ట్ఫోన్లో పంపిణీ
ఏప్రిల్ 11 : బాన్సువాడ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి టీచర్లకు ఆధునిక స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం తన నివాస స్వగృహంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు మాట్లాడుతూ నేడు అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి టీచర్లు 14 రకాల సేవలను డాటా ఎంట్రీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు దీనిలో భాగంగా గర్భిణీలకు బాలింతలకు 0 నుంచి 6 సంవత్సరాల చిన్నారులకు పౌష్టికాహారాన్ని ఎంట్రీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సాధికారత కొరకు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు నేడు ప్రాజెక్టు పరిధిలో 25 స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేయగా మీగీత స్మార్ట్ఫోన్లను సూపర్వైజర్లు వారి వారి పరిధిలో స్మార్ట్ ఫోన్ త్వరలో అందజేయనున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఐసిడిఎస్ ఇన్చార్జి సిడిపిఓ సౌభాగ్య, బీర్కూర్ నసుర్లాబాద్ సూపర్వైజర్ సుమలత అంగన్వాడి టీచర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Comments
Post a Comment