మన ఊరి ముచ్చట పత్రిక బీర్కూరు ఏప్రిల్ 8 :
బీర్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో కుల గణన కార్యక్రమం పై అవగాహన
మండల పర్యవేక్షణ అధికారి భాను ప్రకాష్. ఎంపీ ఓ మైభూబ్
ఏప్రిల్ 8 : బీర్కూర్ మండల కేంద్రంలో నీ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులకు జీపీఓ లకు కులగణన కార్యక్రమం పై ప్రధాన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి మండల పర్యవేక్షణ అధికారి భాను ప్రకాష్, ఎంపీ ఓ మైభూబ్
ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీర్కూర్ మండలంలోని అన్ని గ్రామాలలో ఈనెల 11వ తేదీ నుండి మే 5వ తేదీ వరకు కుల గణన నిర్వహించాలని సూచించారు. గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి జిపిఓ లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని తెలిపారు దీనితోపాటు ప్రతి ప్రతి ఒక ఇంటిని సందర్శించి ఇంటి నెంబర్ ను నమోదు చేసుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో బీర్కూర్ తాసిల్దార్ సవాయిసింగ్ ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో అలిమ్ అక్మల్ పంచాయతీ కార్యదర్శులు జిపిఓ లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment