మన ఊరి ముచ్చట పత్రిక నసుర్లాబాద్ ఏప్రిల్ 11
డ్రై డే సందర్భంగా మైలారం గ్రామాన్ని సందర్శించిన జిల్లా జెడ్పీ సీఈవో
చందర్
ఏప్రిల్ 11 : నసుర్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో డ్రై డే సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలలోనసుర్లాబాద్ ఎంపీడీవో రవిశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జెడ్పీ సీఈవో చందర్ ప్రత్యక్షంగా పాల్గొని మొక్కలకు నీరును అందించారు.
వాటరింగ్ డే కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధులు కాలనీలు ప్రజా ప్రదేశాలలో నీరు పిచికారి చేసి శుభ్రపరచారు అదేవిధంగా మంకీ ఫుడ్ కోర్టు పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత చర్యలు సక్రమంగా నిర్వహించాలని ఉపాధి హామీ సిబ్బందికి ఆయన సూచించారు. గ్రామంలో శుభ్రత నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు దీంతోపాటు గ్రామంలో చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు పనులు వేగవంతంగాపూర్తి చేసీ ప్రజలకు ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించాలని అధికారులకు సూచించారు గ్రామoలో గ్రామ ప్రజలు పరిశుభ్రతలో భాగస్వాములు అయ్యేవిధంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment