మన ఊరి ముచ్చట పత్రిక ఏప్రిల్ 12
ఎత్తిపోతల పథకానికి పంపు మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభోత్సవం చేసిన
పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఏప్రిల్ 12 : బాన్సువాడ నియోజకవర్గంలో నిజాంసాగర్ నాన్ కమాండ్ ఏరియాలో పదివేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కీలకమైన జాకోర , చందూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా శనివారం పంపు మోటార్ల ట్రయల్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు .
వర్ని మండలంలో 106 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. పంపు మోటార్ల పనితీరును పరిశీలిస్తూ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ పథకం అమల్లోకి వస్తే నాన్ కమాండ్ ఏరియాలోనీ రైతులకు సాగునీటి సమస్యలు తగ్గి పంటల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు రైతులు ఆధునిక సాగు పద్ధతులు అవలంబించి లాభాలు పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఎత్తిపోత పథకాల సలహాదారులు వెంకటరెడ్డి, ఇరిగేషన్ సీ. ఈ శ్రీనివాస్, వర్ని జాకోర చందూర్ ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment