మన ఊరి ముచ్చట పత్రిక బీర్కూర్ ఏప్రిల్ 8 :
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సరిపడా కొత్త విధానం
M R O సవాయిసింగ్
ఏప్రిల్ 8 : బీర్కూరు మండలంలోని
పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు ఇసుక కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ' మన ఇసుక వాహనం ' యాప్ ద్వారా ఇసుక కావల్సిన లబ్ధిదారులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని బుధవారం బీర్కూర్ మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కుల గణన సర్వే కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శులకు జిపిఓ లకు ఆయన సూచించారు.
ఈ విధానంలో లబ్ధిదారులు యాప్ లో నమోదు చేసుకున్న వెంటనే ఆ వివరాలు మొదట పంచాయతీ కార్యదర్శి వద్దకు చేరుతాయి. అనంతరం తాసిల్దార్ కు వెళ్లిన అనంతరం పరిశీలన చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. తాసిల్దార్ ఆ వివరాలను యాప్ ద్వారా డౌన్లోడ్ చేసి అవసరమైన లబ్ధిదారుల పేర్లను ధ్రువీకరించి పూర్తి సంతకాలు చేసిన తరువాత పి ఆర్ కోడ్ లబ్ధిదారుల జాబితా సిద్ధం అవుతుందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక లబ్ధిదారుని మొబైల్ కు ఓటిపి పంపబడుతుందని అన్నారు ఆ ఓటీపీ ఆధారంగా మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేయబడుతుందని పంచాయతీ కార్యదర్శులకు జిపిఓ లకు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల పర్యవేక్షణ అధికారి భాను ప్రకాష్ , ఎంపీ ఓ మైభూబ్, పంచాయతీ కార్యదర్శులు. జిపిఓలు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment